Priyamani: భర్తకు దూరంగా ఉంటున్న ప్రియమణి.. అలాంటి పరిస్థితికి కారణమిదేనా?

Priyamani: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రియమణి ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ నాగార్జున ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయినటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించిన ఈమె ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్నారు.

వెండితెర పైన బుల్లితెర పైన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

 

ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియమణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె మిస్ యు ముస్తఫా అంటూ తన భర్తను చాలా మిస్ అవుతున్నట్టు క్యాప్షన్ పెట్టారు. అయితే ఈమె ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ప్రియమణి తనకు రెండవ భార్య కావడంతో వీరి వైవాహిక జీవితంలో ఎన్నో గొడవలు వచ్చాయి. విడాకులు కూడా తీసుకోబోతున్నారంట వార్తలు వచ్చాయి.

 

ఈ విధంగా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలలో నిజం లేదని ప్రియమణి ఖండించారు. అయితే ప్రస్తుతం తన భర్త వ్యాపార పనుల నిమిత్తం ప్రియమణికి దూరంగా ఇతర దేశాలలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈమె కూడా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల తన భర్తకు దూరంగా ఉన్నారని తెలియడంతో చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ ప్రియమణికి భర్త ఉన్నా లేనట్టేనా అయ్యో పాపం భర్తకు దూరంగా ఉంటుందా అంటూ ఈ ఫోటోల పై కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -