Sreeleela: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరిగిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు డైరెక్టర్ లు హీరోయిన్ శ్రీలీల వైపు ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారు. అలా ఒకరు ఇద్దరు హీరోలతో కాదు ఎంతోమంది హీరోలతో నటించడానికి ఇప్పటికే ఓకే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పటికే పవన్ కళ్యాణ్, శ్రీ లీల, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, లాంటి హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ హీరోల సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO20 సినిమాలో హీరో రామ్ తో జత కడుతోంది శ్రీలీల. ఈ క్రమంలోనే సినిమా షూట్ లో భాగంగా మైసూర్ కి వెళ్లిన ఈ ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జీ స్టూడియో సంస్థ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా దసరా పండుగ కానుకగా తెలుగు, తమిళ, కన్నడ మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అయిపోయింది. ఒక రెండు పాటలు క్లైమాక్స్ సీన్లు తప్పిస్తే మిగతా అంతా షూట్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. తాజాగా మైసూర్లో ఈ షూటింగ్ ప్రారంభమైంది. తాజా షెడ్యూల్ రామ్, శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్స్ లో బోల్డ్ గా కూడా కనిపించబోతున్నారట. జూన్ 15 వరకు ఇక్కడే షూటింగ్ జరగబోతున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.