Vikarabad: స్కూ డ్రైవర్ తో పొడిచి దారుణంగా హత్య.. ఏం జరిగిందంటే?

Vikarabad: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు చూస్తే ఒళ్ళు గగ్గుర్పుడుతోంది. సమాజంలో ఇలాంటి దారుణమైన మనుషులు కూడా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని కొన్ని సంఘటనలు తలుచుకుంటేనే భయం వేస్తోంది.. అటువంటి వాటిలో తాజాగా జరిగిన సంఘటన కూడా ఒకటి. తాజాగా తెలంగాణలో ఒక దారుణం చోటుచేసుకుంది. అత్యంత దారుణంగా భయానకంగా అమ్మాయి హత్యకు గురైంది. ఆమె 2 కళ్లను పొడిచేశారు.

గొంతు కోశారు, నీటిలో ముంచారు. వినడానికి భయం పుట్టించేలా ఉన్న ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిగి మండలం కాలాపూర్ లో తాజాగా ఉదయం ఒక యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఊరికి సమీపంలో ఉన్న నీటికుంటలో శవమై తేలిన ఆ అమ్మాయిని 19 ఏళ్ల శిరీషగా గుర్తించారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసిన గ్రామస్తులు, ఆ స్థితి చూసి భయపడ్డారు. శిరీష రెండు కళ్లను స్క్రూ డ్రైవర్ లాంటి పదునైన వస్తువుతో పొడిచారు. ఆ తర్వాత మరో పదునైన వస్తువుతో గొంతు కోశారు. శిరీష ఒంటి పై ఇతర గాయాలు కూడా ఉన్నాయి.

 

దాంతో గ్రామస్తులు వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. ఇంటర్ పూర్తిచేసిన శిరీష, ఈ మధ్యే ఒక పారా మెడికల్ కాలేజీలో చేరిందట. కేసు నమోదుచేసిన వెంటనే విచారణను వేగవంతం చేయగా తాజాగా ఆమె తన అక్క భర్త అనీల్ తో శిరీష గొడవ పడినట్టు గుర్తించారు. ఒక దశలో అనీల్, శిరీషపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష, తను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లిపోయింది. అలా వెళ్లిన కొన్ని గంటలకే ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఇంకా నిజా నిజాలు తెలియాల్సి ఉంది. విచారణలో భాగంగా శిరీష తల్లిదండ్రులను అలాగే బావ అనిల్ ను విచారించనున్నారు పోలీసులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -