South Korea: తల్లి ఘాతుకం.. పసికందుని చంపి ఫ్రిడ్జ్ లో పెట్టి ఆపై అలా?

South Korea: ప్రస్తుత రోజులో చాలామంది పిల్లలు కలగక ఇబ్బంది పడుతుంటే మరి కొంతమంది కసాయి తల్లిదండ్రులు పుట్టిన చంటి పిల్లలను పసికందులను కూడా చంపేస్తున్నారు. ఇంకొందరు శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఒక కసాయి తల్లి కడుపున పుట్టిన బిడ్డను ఫ్రిడ్జ్ లో దాచి పెట్టింది. అసలేం జరిగిందంటే.. దక్షణి కొరియా సిరియా పరిధిలోని సువాల్ ప్రాంతంలో 30 ఏళ్ళ నివసిస్తోంది. కాగా ఆ మహిళలకు గతంలో ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు.

గత కొన్నేళ్ల నుంచి వీరి ఆర్థిక పరిస్థితి బాగా లేనట్లుగా తెలుస్తోంది. అయితే, 2018లో ఈ మహిళ గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత ఈ మహిళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిందని సంతోషపడాల్సిన ఈ దుర్మార్గురాలు ఆ బిడ్డను చంపాలని అనుకుంది. ఇక తన భర్తకు తెలియకుండా ఆ పసి బిడ్డను గొంతు పిసికి చంపి ఇంట్లోని ప్రీజర్ లో దాచి పెట్టింది. కట్ చేస్తే మరో ఏడాది తర్వాత ఈ మహిళ ఈ సారి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా ఈ ఇల్లాలు సంతోష పడలేదు.

 

పుట్టిన మరుసటి రోజే ఆ మగబిడ్డను సైతం చంపి భర్తకు అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న ఫ్రీజర్ లో దాచి పెట్టింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆమె ప్రసవించిన ఆస్పత్రిలోని వైద్యులు ఆడిట్ నిర్వాహించారు. ఈ మహిళ 5 మందికి జన్మనిచ్చిందని రికార్డుల్లో ఉంది. అధికారులు ఆమె ఇంటికి వచ్చి చూడగా ఆ మహిళ వద్ద ముగ్గురు పిల్లలు మాత్రమే కనిపించారు. మిగతా పిల్లలు ఎక్కడ అని ఆమెను ప్రశ్నించగా అబార్షన్ చేయించుకున్నానని భర్తకు చెప్పి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ మహిళ ప్రవర్తనతో ఆ ఆస్పత్రి వైద్యులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపెట్టి చివరికి నేరాన్ని అంగీకరించింది. పుట్టిన పిల్లలను పోషించలేక ఇద్దరు పిల్లలను గొంతు పిసికి హత్య చేసి ఫ్రీజర్ లో దాచి పెట్టానని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. దాంతో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -