Pawan Fans: ఆ పార్టీ వ్యక్తుల విషయంలో పవన్ ఫ్యాన్స్ జాగ్రత్త పడక తప్పదా?

Pawan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి తొలిప్రేమ సినిమాని తిరిగి జూన్ 30వ తేదీ థియేటర్లలో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా తమ అభిమాన సూపర్ హిట్ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాని చూడటం కోసం తరలి వెళ్లారు. అయితే విజయవాడలోని కపర్ది థియేటర్లో మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు విధ్వంసం సృష్టించారు.

సినిమా ప్రసారమవుతున్నటువంటి సమయంలో కొందరు థియేటర్ స్క్రీన్ చింపేయడమే కాకుండా కుర్చీలు విరగొట్టారు. అలాగే థియేటర్ గ్లాసెస్ అన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో ఈ విషయంపై థియేటర్ యాజమాన్యం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈ విధ్వంసం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా కపర్ది థియేటర్ విధ్వంసంలో పవన్ కళ్యాణ్ అభిమానుల హస్తం ఏమాత్రం లేదని తెలుస్తోంది.

 

సినిమా ప్రసారమవుతున్నటువంటి సమయంలో ఓ పదిమంది యువకులు పెద్ద ఎత్తున అల్లర్లకు దిగారని థియేటర్ యాజమాన్యం తెలిపారు. దీంతో వారు స్క్రీన్ చింపడమే కాకుండా అద్దాలు కుర్చీలు అన్నింటినీ విరగొట్టారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానుల పని అయి ఉండదని వారు భావిస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా థియేటర్ విధ్వంసం చేయరు.కొందరు ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ పేరును ఆయన అభిమానుల పేరును డామేజ్ చేయడం కోసమే ఇలాంటి విధ్వంశానికి పాల్పడి ఉంటారని థియేటర్ యాజమాన్యం సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు కాదని వార్త వైరల్ కావడంతో రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ పేరుని ఇలా డామేజ్ చేయడం కోసమే ఇతర పార్టీ వారు ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని అలాంటి వారితో పవన్ కళ్యాణ్ కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -