Kalyani: ఆంధ్రప్రదేశ్ లోత్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఓటమి భయం పట్టుకోవడంతో వారు వైసిపి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యేలు మంత్రులపై మాత్రమే కాకుండా చివరికి వాలంటీర్ల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే ఎంతో మంది వైసీపీ నేతలు స్పందించి వారి స్టైల్ లో పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు. తాజాగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు వాలంటీర్స్ వల్ల మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు చేశారు. అయితే వాలంటీర్ల కారణంగా లోకేష్ చంద్రబాబు నాయుడు వేరు కాపురాలు ఉంటున్నారా అలాగే బ్రాహ్మణి భువనేశ్వరి మధ్య కూడా గొడవలు వాలంటీర్ల వల్లే వచ్చాయా అంటూ ప్రశ్నించారు.
ఈ విధంగా కళ్యాణి చంద్రబాబు నాయుడు లోకేష్ పై మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఒక సంస్కార హీనుడని తెలిపారు. మహిళలంటే ఆయనకు గౌరవం లేదు గతంలో లోకేష్ పవన్ కళ్యాణ్ తల్లి గురించి ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే వాటన్నింటినీ మరిచిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే చేతులు కలిపారని మండిపడ్డారు.
తన తల్లిని చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా అధినేతలు అవమానించారంటూ ట్విటర్ వేదికగా పవన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఫిల్మ్ చాంబర్లో పవన్కల్యాణ్ ఆందోళనకు దిగారు. ఆ సందర్భంలో ఎల్లో మీడియా చానెళ్ల కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత జర్నలిస్టులపై దాడులకు కూడా తెగబడ్డారు. అవన్నీ మర్చిపోయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని కానీ వారిని అవమానించిన వారితోనే చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యం అంటూ శపదాలు చేసి వాలంటీర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ మండిపడ్డారు.