Heroine: నా రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టింది అతనే.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Heroine: బోణి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి కృతికర్బంధ. ఈమె మిస్టర్ నూకయ్య వంటి చాలా తెలుగు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్నంత విజయం రాలేదనే చెప్పాలి. న్యూఢిల్లీలో అక్టోబర్ 29, 1990 న జన్మించిన కృతి మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ముందుగా 2009లో బోణి సినిమా ద్వారా తెరంగేట్రం చేసి, 2010లో కన్నడ చిత్రం చిర్రు ద్వారా ఆ పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టింది. ఆమె దురదృష్టం ఏమిటంటే ఆమె ఆశించిన స్థాయిలో ఒక సినిమా కూడా హిట్ కాలేదు.

కానీ ఉత్తమ నటిగా సైమా అవార్డుని 2013లో గూగ్లీ సినిమా కోసం అందుకుంది. బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ సిస్టర్ గా యాక్ట్ చేసి 2017లో ఉత్తమ సహాయనిటిగా సైమా అవార్డుని అందుకుంది. కృతికర్బంధ రీబూట్ సినిమాతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈమె 2018లో నటించిన ఫిర్సే, 2019లో నటించిన హౌస్ ఫుల్ 4 సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి.

 

అయితే కృతికర్బంధ ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనని భయపెట్టిన ఒక సన్నివేశం గురించి మాట్లాడింది. అదేమిటంటే తను ఒక కన్నడ సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక హోటల్లో స్టే చేసిందట. అక్కడ పనిచేసే వ్యక్తి ఆ రూమ్ లో సీక్రెట్ కెమెరా అమర్చాడట. అయితే ఏ హోటల్ కి వెళ్ళినా రూమ్ ని టాప్ టు బాటమ్ చెక్ చేయడం తనకి, తన స్టాఫ్ కి అలవాటని.. కాబట్టి రూమ్ ని చెక్ చేసినప్పుడు ఆ సీక్రెట్ కెమెరా బయటపడిందని తెలిపింది.

 

ఆ వ్యక్తి ఆ కెమెరాని సెటప్ బాక్స్ వెనకాతల అమర్చాడని.. ఆ ఇన్సిడెంట్ తనని ఎంతో భయపెట్టిందని.. ఆ ఇన్సిడెంట్ తర్వాత బయట స్టే చేయవలసిన అవసరం వస్తే మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది కృతికర్బంధ. ఈ విషయంలో ఈమె లక్కీ అనే చెప్పుకోవాలి చాలామంది ఈ సీక్రెట్ కెమెరాలు గమనించక బలైపోయిన తారలు చాలామంది ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -