Vaishnavi Chaitanya: ఒక్క సినిమాతో వైష్ణవి చైతన్యకు ఆటిట్యూడ్ పెరిగిందా.. మార్చుకోకపోతే ఇండస్ట్రీలో కష్టమేనా?

Vaishnavi Chaitanya: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు నటించిన ఒకటి రెండు సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ అయ్యాయి అంటే చాలు వెంటనే రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు యాటిట్యూడ్ ని కూడా చూపిస్తూ ఉంటారు. అయితే సినిమా హిట్ అయిన తర్వాత క్రేజ్ రేంజ్ పెరిగితే పర్లేదు కానీ యాటిట్యూడ్ పెరిగితే అది వాళ్లకు ఏ మాత్రం మంచిది కాదు అని చెప్పవచ్చు. అది నిర్మాతలకు కష్టం కూడా అవుతూ ఉంటుంది.

 

ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గురించి కూడా అలాగే చర్చించుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు ఒక తెలుగు సినిమా హీరోయిన్. ఇటీవలే ఆమె నటించిన మొదటి సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే ఆ సినిమా హిట్ అవ్వడంతో సదరు హీరోయిన్లు అప్పుడే యాటిట్యూడ్ మొదలయ్యిందని తెలుస్తోంది. మొదటి సినిమాకే యాటిట్యూడ్ ని చూపిస్తోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ తెలుగు హీరోయిన్ ఎవరో బాగా అర్థమయ్యే ఉంటుంది.

 

ఆ హీరోయిన్ మరెవరో కాదు వైష్ణవి చైతన్య. బేబీ సినిమాను బాగా పొగడడంతో పాటు ప్రతి ఒక్కరు ఆమెను బాగా పొగడడం, ఆమె వల్లే సినిమా ఆడిందనేంతగా మాట్లాడడం, ఇవన్నీ కలిసి ఆమె వైఖరిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది మరి ఆమె దృష్టికి వెళ్లిందో, లేదో కానీ ఆమె మాత్రం యాటిట్యూడ్ ని మార్చుకుంటే మంచిది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -