Laxmi Devi: లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు కావాలంటే చేయాల్సిన పని ఇదే.. కోటీశ్వరులు అవుతారంటూ?

Laxmi Devi:  సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో కష్టపడి పైకి ఎదగాలని దానికి తోడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం కోసం వాస్తు చిట్కాలు, అమ్మవారికి పూజలు నైవేద్యాలు అంటూ రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే చాలు కోటీశ్వరులు అయిపోవడం ఖాయం అని విశ్వసిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి కనుక చేరిందంటే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్లి పోతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆవనూనెతో దీపాన్ని వెలిగించి రెండు లవంగాలను అందులో వేసి వాటిని మీ ఇంటి ముఖ ద్వారం ముందు రెండు వైపులా ఉంచాలి. ఆ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలని వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి అంతా మంచి జరగడంతో పాటు లక్ష్మీదేవి కు అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పారిపోతుంది. కర్పూరం వలన మంచి వాసనే కాదు. కర్పూరాన్ని వెలిగించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

ఆవుకి ఆహారాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. ఎంతో పుణ్యం వస్తుంది. గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది మిమ్మల్ని చక్కగా చూస్తారు. గోమాతకి రోజూ ఏదైనా ఆహారం పెట్టండి. ఇలా చాలా సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా పక్షులకి ఆహారం పెడితే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. జీవితంలో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు తుడవకూడదు. అలా చేయడం వలన సంపద పోతుంది. లక్ష్మీదేవి కోప్పడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -