Anushka Shetty: సీనియర్ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఏ ఏజీ హాస్పిటల్ లో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన వయసు పై పడటంతో అనారోగ్య సమస్యలకు గురయ్యారు. దీంతో నెల రోజులపాటు ఏ ఏజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణంరాజు మరణించారు.
ఈ విధంగా కృష్ణంరాజు మరణించి ఏడాది పూర్తి కావడంతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు కూడా కృష్ణంరాజు గారి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఫ్యామిలీకి ఎంతో చనువుగా ఉండే నటి అనుష్క సైతం కృష్ణంరాజు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా అనుష్క కృష్ణంరాజు గారి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. కృష్ణం రాజు గారు ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఈయన ఒక గొప్ప నటుడిగా మనిషిగా ఆయన ప్రేమతో మిగిల్చిన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా అనుష్క కృష్ణంరాజు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయనని తలుచుకుంటూ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక కృష్ణంరాజు, ప్రభాస్ తో కలిసి అనుష్క పలు సినిమాలలో నటించారు అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా కృష్ణంరాజు గారి ఫ్యామిలీతో అనుష్కకు చాలా మంచి అనుబంధం ఉంది దీంతో ఆయన మరణించిన సమయంలో కూడా ఈమె అర్ధరాత్రి సమయంలోనే హాస్పిటల్ కి వెళ్లి ఎంతో కన్నీటి పర్యతరమయ్యారు. ఇక అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా పలు సినిమాలలో నటించడంతోనే వీరి కుటుంబంతో అనుష్కకు ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.
Remembering Krishamraju garu fondly on his first anniversary, with all the loving memories he left behind as big hearted human being and a great actor … 🤗🙏🏻 pic.twitter.com/ZGchVW8aSE
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2023