Lakshmi Devi: పూజగదిలో వీటిని పెడితే మాత్రం లక్ష్మీ కటాక్షమే.. ఆర్థిక సమస్యలు దూరమవుతాయా?

Lakshmi Devi: హిందువులు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు కోటీశ్వరులు అవ్వడం కాయం. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండి ఎటువంటి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఉండకుండా ఉండాలి అంటే పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టాలి అంటున్నారు పండితులు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ చేసే సమయంలో మనం గంటని మ్రోగిస్తాము.

పూజ గదిలో గంటని పెట్టినట్లయితే దుష్టశక్తులు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు ఉండవు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పూజ గదిలో నెమలి ఈకని పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా దృఢంగా ఉండచ్చు. ఆర్థిక బాధలు ఏమీ ఉండవు. కాబట్టి నెమలి ఈకని కూడా పూజ గదిలో పెట్టుకోవాలి. దీపం లేకపోతే పూజ అసంపూర్ణం. పూజ గదిలో దీపాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. పూజ గదిలో దీపాన్ని పెట్టినప్పుడు పడమర వైపు పెట్టాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. పూజ గదిలో శంఖాన్ని పెడితే కూడా సిరిసంపదలు కలుగుతాయి. పూజ గదిలో నీళ్లు నింపిన కలశాన్ని పెడితే, ఆర్థిక సమస్యలు తొలగిపోయిప్రశాంతంగా ఉండవచ్చు.

గంగాజలాన్ని పూజ గదిలో పెడితే కూడా చాలా మంచి కలుగుతుంది. పూజగదిలో ఇత్తడి లేదంటే వెండి పాత్రలో గంగాజలం పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఇలా వీటిని పూజ గదిలో పెట్టినట్లయితే ఆర్థిక బాధలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -