Uttar Pradesh: వయసుకు వచ్చిన కూతురు తెలిసి తెలియక తొందరపాటుతనంతో పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే తన కూతురు పెళ్లికి ముందే గర్భవతి అనే విషయం తెలుసుకున్నటువంటి ఆ తల్లి కూతురు పట్ల చాలా కిరాతకంగా ప్రవర్తించింది. తన కూతురు గర్భం దాల్చిన విషయం తెలియడంతో ఏకంగా ఆమెకు ప్రాణాలు తీసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నేవడ ఖర్ధ్ గ్రామానికి చెందినటువంటి 21 సంవత్సరాల యువతి పెళ్లి కాకుండానే తల్లి అయింది అయితే ఈ విషయం తన కన్న తల్లికి తెలియడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. తన గర్భానికి కారణమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం ప్రియుడి వివరాలను వెల్లడించలేదు.
ఈ విధంగా తన తల్లి ఎంత అడిగినా చెప్పకపోవడంతో తన తల్లితో పాటు హామీ సోదరుడు తనని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తనపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఇలా మంటల్లో కాలిపోతున్నటువంటి ఆయుధం గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు దీనితో ఆ యువతిని కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరం 70% కాలిపోయి ఉంది.ఇలా కూతురి పట్ల తల్లి కొడుకు చేసినటువంటి ఈ ఘోరాన్ని ఖండించినటువంటి పోలీసులు వారిపై కేసు నమోదు చేసి స్టేషన్ కి తరలించారు