Nagarjuna: నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా.. మంచి డైరెక్టర్ నే పట్టాడంటూ?

Nagarjuna:  అక్కినేని నాగార్జున చివరిగా ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత నాగార్జున దాదాపు ఏడాది పాటు ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఈయన నా సామీరంగా అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా నాగార్జున కెరీర్లు 99వ సినిమా కావటం విశేషం ఇలా. ఇక ఈయన వందల సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని ఈ సినిమా గురించి గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే మరి ఈయన వందవ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అన్న విషయాల గురించి వార్తలు వినిపించాయి. నాగార్జున తన నూరువ సినిమాలో అఖిల్ తో కలిసి చేయబోతున్నారని ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు. అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా నాగార్జున 100 వ సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. ఈయన మెహర రమేష్ దర్శకత్వంలో కాదని, నాగార్జున తన నూరవ సినిమాని మరో త‌మిళ‌ ద‌ర్శ‌కుడు న‌వీన్ కి ఆ అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. ఈయన ఈ ఏడాది త‌మిళంలో `అగ్ని సిర‌గుగ‌ల్‌` అనే సినిమా తీశాడు న‌వీన్‌. విజ‌య్ ఆంటోనీ, అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. త‌మిళంలో బాగానే ఆడింది. ఇప్పుడు అదే డైరెక్టర్ కి నాగార్జున అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. స్క్రిప్టుని, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్నీ లాక్ చేసిన త‌ర‌వాతే… అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడే అవ‌కాశం ఉందని తెలుస్తుంది ఇక నాగార్జున నటించిన నా సామీరంగా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -