Heroine: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే చాలామంది హీరోయిన్లు డబ్బు సంపాదనతో ఇతర వ్యాపార రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కానీ ఒకానొక సమయంలో సినిమాలలో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ కోట్లలో సంపాదిస్తూ అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి వారిలో నటి ప్రీత ఒకరు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మంజుల దంపతులకు నలుగురు కుమార్తెలు అనే విషయం తెలిసిందే.వీరిలో ఒకరిగా ప్రీత ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు.
ఈమె అచ్చం చూడటానికి శ్రీదేవి పోలికలతో ఉంటారు. 1995 వ సంవత్సరంలో ఈమె రుక్మిణి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈమె కేవలం తమిళ మాత్రమే కాకుండా తెలుగు మలయాళ సినిమాలలో కూడా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.
2002వ సంవత్సరంలో దర్శకుడిని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పినటువంటి ఈమె కళ్యాణ మండపం నిర్మించి తన బిజినెస్ ప్రారంభించారు. అలాగే మద్రాస్ కేఫే అనే ఒక టీ స్టాల్ నడుపుతూ భారీ స్థాయిలో లాభాలను అందుకుంటున్నారు. ఈ కేఫేలో అంతా మహిళ వర్కర్స్ పనిచేయటం గమనార్హం. వీటితోపాటు స్థానిక సాలిగ్రామంలో సినీ ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియోలను కూడా నిర్వహిస్తూ ఈమె నెలకు కొన్ని కోట్లల్లో లాభాలను అందుకుంటున్నారు.