AP BJP Selling MLA Seats: ఏపీ బీజేపీలో సీట్లు అమ్ముకుంటున్నారా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లకే సీట్లా?

AP BJP Selling MLA Seats: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రతి ఒక్క పార్టీలోను పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా భాజాపాకు కేటాయించిన సీట్లను వేలం పాట వేసి మరి అమ్ముకున్నారంటూ తాజాగా ఓ వార్త సంచలనంగా మారింది.

బిజెపి పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో ఆ పార్టీకి చెందినటువంటి ఎంతో మంది సీనియర్లు తమకు టికెట్ వస్తుందని ఆశించారు కానీ పార్టీ నేతలకు కాకుండా వలస వెళ్లిన వారికే పెద్ద పీట వేస్తూ ఉండటం గమనార్హం. బిజెపి నాయకురాలు అయినటువంటి పురందేశ్వరి ముందుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని కొంతమంది బిజెపి సీనియర్ నాయకులు ఆరోపణలను కురిపిస్తున్నారు.

సాధారణంగా ఒక పార్టీ నుంచి పోటీ చేయాలంటే పార్టీకి సేవ చేసి కష్టపడినటువంటి సీనియర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఈసారి మాత్రం టిడిపి నుంచి బిజెపిలోకి వలస వెళ్లి పార్టీ కోసం ఏమాత్రం కష్టపడనటువంటి వారికి మాత్రమే సీట్లను ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సీట్లను కూడా వేలం పాటలో భాగంగా కేటాయింపులు చేశారని విషయం బయటపడింది.

వేలంపాటలో భాగంగా ఎవరు ఎక్కువ డబ్బులకు కొనుగోలు చేసుకుంటే వారికే సీట్ అనేలా బిజెపి సీనియర్ నాయకురాలు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వారికి అనుకూలంగా ఉన్న వారిని నిలబెట్టి కేంద్రం నుంచి వచ్చే ఎన్నికల ఫండ్ కూడా వాళ్లే పంచుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నికలలో నిలబడాలి అంటే టికెట్ అవసరం అయితే ఆ టికెట్ పొందాలి అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారికే సీట్లు అనేలా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -