Srinivasananda Saraswathi: జగన్ మళ్లీ గెలిస్తే దేవుళ్లు కన్నీళ్లు పెడతారు.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Srinivasananda Saraswathi: ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం తిరిగి ఎన్నికలలో మరోసారి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయాలలో దేవుళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి వస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల ఓ ఛానల్లో పాల్గొన్నటువంటి ఈయన ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం మంట కలిసి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో హిందూ ధర్మాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని ఈయన తెలిపారు. ప్రతి ఒక్క ఆలయాలలో కూడా క్రైస్తవ ఉద్యోగులను చేర్పించి ఆలయాల ప్రతిష్టను దిగజారుస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. ఇలా హిందూ వ్యతిరేకగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చాలామంది స్వాములు వంతు పలుకుతున్నారు అలా చేయటానికి సిగ్గుండాలని ఈయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మన రాష్ట్రంలో హిందూ ధర్మానికి పట్టినటువంటి గతిపై పొరుగు రాష్ట్రాలలో ఆందోళనలు చెందుతున్నారని తెలిపారు. రామతీర్థంలో రాముడి విగ్రహాలు ధ్వంసం అయితే దోషులను పట్టుకోలేదు. కనకదుర్గమ్మ రెండు సింహాలు మాయమైతే అతిగతి లేదు. సింహాచలం భూములను కాజేయడానికి కూడా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు.

ఇలా హిందూ ధర్మానికి ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని అయినప్పటికీ కొంతమంది స్వాములు ఈయనని మఠానికి తీసుకువచ్చి యగ్నాలు హోమాలు చేస్తున్నారని తెలిపారు. తాను హిందూ భక్తులందరిని ఒకటే వేడుకుంటున్న పార్టీలను పక్కనపెట్టి హిందూ ధర్మాన్ని కాపాడండి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మీ ఓటుతో బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తొలగించండి అంటూ ఈయన పిలుపునిచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -