Uttar Pradesh: భర్త అంటే పంచప్రాణాలు.. కానీ చివరికి అలా?

Uttar Pradesh: ఇటీవల కాలంలో చాలామంది ఆడపిల్లలు కోటి ఆశలతో అత్తారింట్లోకీ అడుగు పెట్టిన ఆడపిల్లల జీవితంలో ఊహించని విధంగా నాశనం అవుతున్నాయి. అత్తింటి వారు భర్తలు వేధింపులు తాళలేక చాలామంది నవ వధువులు పెళ్లి అయిన ఏడాది ఆరు నెలలు రెండు మూడు ఏళ్లకే తను చాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా వరకట్నపు వేధింపుల విషయంలో చాలామంది వివాహితలు బలవుతున్నారు. అటు పుట్టింటి వారికి ఇటు మెట్టినింటి వారికి చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ బాగత్ పరిధిలోని బారోట్ ప్రాంతంలో ఇర్ఫాన్, సనా దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కిందటే పెళ్లి జరిగింది. పెళ్లయిన కొంతకాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత అత్తమామలు భర్త నుంచి సనాకు అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఆ విషయంపై సనా తల్లిదండ్రులు అల్లుడు ఇర్ఫాన్ కు సరి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సనా ఊహించని విధంగా ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సనా తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కూతురు సనాని అలా చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై సనా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలం నుంచి అదనపు కట్నం వేధిస్తున్నారని చిత్ర హింసలకు గురి చేశారని, సనాను భర్త, అత్తింటివాళ్లే హత్య చేసి ఆత్మహత్యకు చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అత్తమామలే మా కూతురిని హత్యచేశారని సనా తల్లిదండ్రులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -