Viral: ఇటీవల కాలంలో యువతీ యువకులు ప్రేమ అన్న మోజులో పడి వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మరి కొందరు పెద్దలను ఒప్పించలేక ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తున్నారు. ఇంకొందరు ప్రేమికులు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి వారి ప్రాణాలను నిలబెట్టుకోవడంతో పాటు రక్షణను పొందుతున్నారు. తాజాగాకు ఒక జంట కూడా అలాగే చేసింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు రక్షణ కల్పించాలి అంటే గుడిలో ఉంది పోలీసులను ఆశ్రయించారు.
తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక ప్రేమ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బుద్దాలపాలెం రామాలయంలో పెళ్ళి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు గడియ పెట్టుకుని ఆలయంలోనే ఉండిపోయారు. వరుడు,, వధువు ఇద్దరు కూడా సచివాలయ ఉద్యోగులే కావడం విశేషం. కులాంతర వివాహం చేసుకొని పెద్దలకు భయపడుతూ గుడికి పరిమితమయ్యారు. ఇరువురి తల్లితండ్రులు వారి ప్రేమను అంగీకరించరని ఏదైనా చేస్తారని భయంతో ప్రేమ జంట గుడిలోంచి బయటకురాలేదు. ఆ తర్వాత భయంతో ప్రేమికులు చేసేదేమీ లేక పోలీసులకు సమాచారం అందించారు.
తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ రక్షణ కల్పించమని యువతీ, యువకుడు రక్షణ కల్పించమంటూ పోలీసులను కోరారు. ప్రేమికుల విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమికులతో మాట్లాడారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ప్రేమ జంట బయటకు వచ్చారు. ఈ విషయం ఆ నోట ఈ నోట మారి తెగ వైరల్ అవ్వడంతో ఇది కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.