Viral: వైరల్ అవుతున్న ప్రముఖ నటుడు రిషబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Viral: అయోధ్యలో జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరగబోతుంది. ఈ మహాకృతువుని కళ్లారా చూసేందుకు దేశ విదేశాల నుంచి మహాసాధువులు, పండితులు తరలిరానున్నారు. అలాగే పలువురు సినీ క్రీడా రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలు భాగం కానున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు.

జనవరి 22న జరగనున్న ఈ మహాక్రతువు కోసం కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున దీపావళి చేసుకోవాలని నరేంద్ర మోడీ దేశ ప్రజలకి పిలుపునిచ్చారు. ఈ వేడుకలో భాగంగా సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందాయి. తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి కూడా అయోధ్య నుంచి పిలుపు అందింది.

 

అయితే ఈ ఆహ్వానం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు రిషబ్ శెట్టి. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు శ్రీరామ జయరామ జయ జయ రామ. మేము చిన్నప్పటినుంచి ఇళ్లలో శ్రీరాముని ప్రవచనాలు ఆయన ఆదర్శమైన జీవిత కథలను వింటూ పెరిగాము. ఇప్పుడు ఆ శ్రీరాముడే అయోధ్యకు రమ్మని మమ్మల్ని పిలిచాడు ఇది నా పూర్వజన్మ సుకృతం.

 

ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది శ్రీరాముడికి జయం కలుగుగాక అయోధ్యకు జయం కలుగుగాక అని ట్వీట్ చేశాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జై శ్రీరామ్ అంటూ అభిమానులు నెటిజన్లు, కామెంట్లు పెడుతున్నారు. ఇక మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దంపతులు, మోహన్ బాబు, ప్రభాస్ వంటి నటులకు ఆహ్వానం అందిన సంగతి తెలిసినదే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -