Rajasthan: వృద్ధురాలిని చంపి మాంసాన్నీ తిన్న రాక్షసుడు?

Rajasthan: సమాజంలో రాను రాను మనుషులు సైకోలు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు మనుషుల కంటే జంతువులు మేలు అన్న సందేహం రాక మానదు. మనుషులను పీక్కుతినే రాక్షసుడు మన మధ్య తిరుగుతున్నారు. మామూలుగా మనుషులను ఇతర జంతువులు ఆహారం కోసం వేటాడు తినడం ఇలాంటి ఘటనలు ఇదివరకే మనం చూసి ఉండటం లేదా విని ఉంటాం. మనిషిని మరొక మనిషి చంపి పీక్కు తినడం అనే ఘటనలు చాలా అరుదుగా తక్కువగా విని ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ పాలీ జిల్లాలోని శారధన గ్రామంలో శాంతాదేవి అనే 60 ఏళ్ళ వృద్ధురాలు నివసిస్తోంది. ఇటీవల ఒక 40 ఏళ్ల వ్యక్తి శాంతా దేవిని గమనించాడు. మెల్లగా ఆమె వద్దకు వెళ్లి చితకబాదాడు. అంతేకాకుండా శాంతాదేవిని దారుణంగా కొట్టి చంపాడు. అంతటితో ఆగని ఆ నవరూప రాక్షసుడు ఆమె తలను పగలగొట్టి అందులో ఉన్న మాంసాన్ని పీక్కుతున్నాడు. ఇదంతా చూసిన సమీప గొర్రెల కాపరులు భయందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

 

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడి వద్ద దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా అతడు ముంబాయికి చెందిన సురేంద్రగా పోలీసులు గుర్తించారు. అయితే, గత కొంత కాలం నుంచి ఇతని మానసిక పరిస్థితి బాగలేదని, దీని కారణంగా సైకోగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh-Murugudu Lavanya: మంగళగిరిలో సీన్ సితారే.. లోకేశ్ దెబ్బకు వైసీపీ లావణ్య సైలెంట్ అయ్యారా?

Nara Lokesh-Murugudu Lavanya: 2019 ఎన్నికలలో నారా లోకేష్ వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే...
- Advertisement -
- Advertisement -