Rajasthan: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచిన భర్త.. ఎందుకో తెలుసా?

Rajasthan: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలికి చిలికీ గాలి వానగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రాణాలు కూడా తీయవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తలు చిన్న చిన్న గొడవలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ దౌసా జిల్లా బైజుపాడ పరిధిలోని కొతిన్ గ్రామంలో వినీతా దేవి అనే 22 ఏళ్ళ వివాహిత నివసిస్తోంది. ఉంటుంది. వినీతాకీ గతంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. పెళ్లైనప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇటీవలే వినీతా ఆమె భర్త ఇద్దరు కలిసి వినీతా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు పయనం అయ్యారు. భార్యా భర్తలు బైక్ పై బయలుదేరారు. ఇక మార్గమధ్యలోకి రాగానే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, వినీతా భర్త ఒక్కసారిగా రాక్షసుడిగా మారాడు.

తన వెంట తెచ్చుకున్న కత్తితో పట్టపగలు భార్యపై దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త దాడిలో భార్య వీనితా దేవి రక్తపు మడుగులో అక్కడ అలా పడిపోవడంతో అది గమనించిన స్థానికులు ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అసలు ఆ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. ఆ మహిళపై ఏకంగా 15 పైగా కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

 

అయితే ప్రస్తుతం వినీతా దేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆనందంగా బయలుదేరిన ఆ భార్యాభర్తల మధ్య ఏం జరిగింది? అసలు వినీత భర్త ఆమెను ఎందుకు చంపాలి అనుకున్నారు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -