Bengaluru: ఒక్క కారణంతో యువతిని ప్రేమించిన యువకుడు.. ఆపై?

Bengaluru: రోజురోజుకీ దేశవ్యాప్తంగా మనుషుల్లో మానవత్వం మంట కలిసి పోతోంది. చిన్న చిన్న కారణాలకే ఎదుటి వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగే ఘటనలు వింటేనే ఒళ్ళు జలదరిస్తున్నాయి. అంత దారుణంగా ఎదుటి వ్యక్తిని ఎలా చంపగలుగుతున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు లో దినకర్ అనే యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అదే సమయంలో లీలా అనే యువతితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరూ ఐదు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం చెప్పారు. ముఖ్యంగా లీలా తల్లిదండ్రులు కులాంతర వివాహం చేయడానికి ససేమిరా అన్నారు. దాంతో తన కుటుంబ సభ్యులను ఎదిరించే ధైర్యం చేయలేకపోయింది లీలా. ఈ క్రమంలోనే లీలా కొంతకాలంగా దినకర్ ని దూరంగా ఉంచడం మొదలు పెట్టింది. అది తట్టుకోలేక దినకర్ ఏకంగా ప్రేమించిన యువతిపై కక్ష్య పెంచుకున్నాడు.

 

ఎలా అయిన ఆమెను చంపేయాలని అనుకున్నాడు. లీలా జాబ్ చేసే కంపెనీ వద్ద వెయిట్ చేసి ఆమె రాగానే గొడవ పెట్టుకున్నాడు తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో 16 సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపాడు. దీంతో లీలా అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో దినకర్ ని చూసి అక్కడ ఉన్నవారంతో కూడా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేరుకున్న పోలీసులు నిందితుడు అయిన దినకర్ ని అరెస్టు చేశారు. అనంతరం లీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన యువతి తనకు దక్కకపోగా తనని దూరం పెడుతుందన్న ఒక కారణంతో ఆ యువకుడు ఆమెను దారుణంగా చంపాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -