Volunteers: ఏ పాపం చేయని వాలంటీర్లపై ఆరోపణలా.. ఇదేం న్యాయం పవన్!

Volunteers: ”ఎద్దులా ఎదిగావ్.. ఇంతవరకూ బుద్ధి రాలేదు.. ఇకముందు వస్తుందో రాదో తెలీదు…’ ఇది బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో పలికిన డైలాగ్… ఇన్నాళ్లకు .. ఇన్నేళ్లకు అదే డైలాగ్ తనకు సరిగ్గా సరిపోయేలా తన ప్రవర్తన దిగజారింది. వారం రోజులకోసారి వారాహి యాత్రకు విరామం ఇచ్చి. ఎక్కడెక్కడో స్క్రిప్ట్ తెచ్చుకుని, మరి ఏమి స్టెరాయిడ్స్ వాడతారో.. ఏమి మందులు వేస్తారో కానీ ఎక్కడలేని హుషార్ తెచ్చుకుని.. ఒంటి మీద సోయికూడా మర్చిపోయి మాట్లాడుతుంటాడు. అసలు తాను అనే మాటలకు ఆధారం కానీ.. రుజువులు కానీ లేకుండా నోటికివచ్చినట్లు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్‌గా మారిపోయారు.

 

కోవిడ్ దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న సమయంలో ఈ వాలంటీర్లు చేసిన సేవలు నిరుపమానం.. ఇంటింటికి తిరిగి కోవిడ్ రోగులను గుర్తించి సేవలు.. మందులు అందించి వారిని ప్రాణభిక్ష పెట్టిన సేవకులు ఈ వాలంటీర్లు .. అందుకే కేరళ… ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్ర మోడల్‌ను గుర్తించి తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పొద్దు పొడవక ముందే సంక్షేమ పథకాలు గుమ్మం ముందే అందించే సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు. వీరు ఇంటింటికి వెళ్లి అమ్మాయిలు, వితంతువుల లెక్కలు తీసి వేరేవాళ్లకు పంపిస్తే వాళ్లొచ్చి వీళ్ళను ట్రాప్ చేసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారని అన్నావు.. నీకు బుర్రలో బుద్ధి ఉందో .. ఆవుపేడ ఉందో అర్థం కావడం లేదు.. నువ్వు చదివిన రెండు లక్షల పుస్తకాల్లో ఎక్కడా .. సభ్యత, సంస్కారం గురించి ఒక్క లైన్ కూడా లేదేమో అందుకే వాలంటీర్లతో 70 శాతం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడావు . కోవిడ్ సమయంలో మృతుల కడసారి చూపులకు సైతం బంధుమిత్రులు రాని కష్టకాలంలో ఆ మృతులకు అన్నీ తామే అయ్యి అంత్యక్రియలు చేసిన వలంటీర్ల సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కానీ పవన్ కళ్ళకు అవి కానరాలేదు

 

వాలంటీర్లను కూలీలు, గోనెసంచుల మోసేవాళ్ళు అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పటికే బుద్ధితెచ్చుకుని తమ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అని చెప్పారు. ముసలోడైన చెంద్రబాబుకు..నీ తోడు లోకేష్‌కు సైతం ఉన్నపాటి సోయి నీకు లేకపోవడం దారుణం ప్యాకేజి స్టార్. హైదరాబాద్‌‌లో కాపురం ఉంటూ.. ఆఫ్ కోర్స్ మీకు పెళ్ళాం లేదు కానీ.. అక్కడే నివాసం ఉంటూ అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుని ఆంధ్ర రావడం .. విజయవంతంగా నడుస్తున్న వ్యవస్థల మీద దుమ్మెత్తిపోయడం… మళ్ళీ షూటింగులకు వెళ్లిపోవడం.. ఇదే మీ దినచర్య.

 

మీలాంటి పార్ట్ టైం గాళ్ళను ఎక్కడ పెట్టాలో జనానికి బాగా తెలుసు.. అందుకే రెండుచోట్లా ఓడగొట్టి మూల కూర్చోబెట్టారు. అయినా బుద్ధిరాలేదు.. వస్తుందో లేదో తెలీదు.. నువ్వు చేసే బేవకూఫ్ స్టేట్మెంట్లకు మళ్ళీ కేంద్ర ఇంటలిజెన్స్ పేరు ఎందుకు చెప్పు ? కేంద్ర సంస్థలు ఒక్కోసారి రాష్ట్రాలకు సైట్ తెలియకుండా ఆపరేషన్స్ చేస్తాయి. అవి కేంద్రానికి మాత్రమే బాధ్యత వహిస్తాయి. అలాంటిది వార్డ్ మెంబర్ కూడా కానీ నీకు ఎందుకు ఇస్తారు.? గోదావరి జిల్లాల్లో ఇష్టానుసారం మాట్లాడి ప్యాకేజి ఎక్కువ బేరం తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లున్నావ్.. కానీ అది జరగదు… మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి. నీకు డబ్బులు కావాలంటే చంద్రబాబు దగ్గర బేరం చేసుకో.. లేదు దెబ్బలే కావాలంటే లక్షలాదిమంది సైన్యం లాంటి వాలంటీర్లతో పెట్టుకో. ఇక నీకు వెనకాముందూ ఉండదు.. ఇత్తడే

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -