హీరోయిన్ అమలాపాల్ కు ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు తమిళం, మలయాళ భాషల్లో సినిమాలతో ఓ వెలుగు వెలిగింది అమలాపాల్. అయితే ఇప్పుడు ఆమె క్రేజ్ తగ్గింది. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే అమలాపాల్ అంటేనే వివాదాలు ముందు ఉంటాయి. వివాదాలతో ఎప్పుడూ అమలాపాల్ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఏదోక వివాదంతో హీటెక్కిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదోక వివాదంతో నలుగుతూనే ఉంటుంది.
తాజాగా మరోసారి అమలాపాల్ వివాదంతో ముందకొచ్చింది. తన ప్రియుడిపైనే అమలాపాల్ కేసు పెట్టింది. తన ప్రియుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పుడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అమలాపాల్ ప్రియుడు పవీందర్ తో పాటు మరో 100 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 10 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
2018లో అమలాపాల్, పవీందర్ సింగ్ కలిసి ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేవారు. అప్పుడు వారి పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. కానీ బిజినెస్ వ్యవహారాల్లో గొడవలు రావడంతో వీరిద్దరు విడిపోయ్యారు. అయితే తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడమే కాకుండా తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను చూపించి బెదిరిస్తున్నాడని అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు అడిగితే ప్రైవేట్ వీడియోలను బయట పెడతానంటూ బెదిరిస్తున్నాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో అమలాపాల్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ప్రియుడు పవీందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతడి స్నేహితులు కూడా లైంగికంగా వేధిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొంది. దీంతో పవీందర్ ను అరెస్ట్ చేయగా.. అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఆమె ప్రియుడు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.