Amala Paul: మార్చురీలో అది చూసిన తర్వాత జీవితం మారిపోయింది.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్

Amala Paul: హీరోయిన్ అమలాపాల్ ఒకప్పుడు స్టార్ హీరోయన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సినిమా చేసి హీరోయిన్ గా మంచి పేరే దక్కించుకుంది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ లో అమలాపాల్ ఎలాంటి సినిమా చేయడం లేదు. కానీ తమిళం మాతం ఈ బ్యూటీ చేస్తూ అక్కడ హీరోయిన్ గా తమ హవాను కొనసాగిస్తుంది. అలాగే హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే అమలాపాల్ నిర్మాతగా కూడా అమతారమెత్తింది. నిర్మాతగా తమిళలో పలు సినిమాలు నిర్మించింది.

కడవెర్ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో అమలాపాల్ నటించడమే కాకుండా ఆ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో కోసం అమలాపాల్ ఎంతో కష్టపడిందని చెప్పవచ్చు. పోలీసులను కలిసి క్రైమ్ జరిగాక ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారనే విషయాలను కనుక్కుంది. దీని కోసం పూర్తిగా అమలాపాల్ రీసెర్చ్ చేసి సినిమా కోసం గ్రౌండ్ వర్క్ బాగానే చేసింది. ఆగస్టు 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదలైంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమలాపాల్ కీలక విషయాలు బయటపెట్టింది. సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డానో తెలిపింది. సినిమా కోసం గ్రౌండ్ వర్క్ లో భాగంగా తాను మార్చురీలో పోస్టుమార్టం చేయడం చూశానని, అది తన జీవితంలో మర్చిపోలేని రోజని స్పష్టం చేసింది. తన హృదయాన్ని కదిలించిన దృశ్యం అది అని అమలాపాల్ చెప్పింది. పోస్టుమార్టం చేయడం చేసిన తర్వార తన జీవితం మారిపోయిందని, ప్రతి విషయాన్ని తాను చూసే కోణం కూడా మారిందని ఆమె చెప్పింది.

ఈ సినిమా కోసం తన జుట్టును కత్లిరించుకుని ఒదిగిపోవాలనుకన్నానని, స్క్రిఫ్ట్ విన్న సమయంలో అసలు ఈ పాత్రను ఊహించలేకపోయానని అమలాపాల్ చెప్పుకొచ్చింది. వైద్యులు ఎలా ఉంటారో తెలుసుకునేందుకు చాలా శ్రమించానని చెప్పింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -