Balagam: బలగం సీన్ పై అలాంటి కామెంట్లు చేసిన నటులు.. ఏం జరిగిందంటే?

Balagam: ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం అందుకున్నటువంటి సినిమాలలో బలగం సినిమా ఒకటి.జబర్దస్త్ మాజీ కమెడియన్ వేణు దర్శకత్వంలో కావ్య కళ్యాణ్ రామ్, ప్రియదర్శి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలంగాణలోని ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో పెద్ద ఎత్తున స్క్రీన్లు వేసి గ్రామ ప్రజలందరూ ఈ సినిమాని వీక్షించారు.

ఈ సినిమా ద్వారా ఎన్నో ఏళ్లుగా మాటలు లేకుండా విడిపోయిన అన్నదమ్ములు కూడా కలిశారు. ఇలా బంధాలు బంధాల ప్రాముఖ్యతను బలగం సినిమా తెలియజేసిందని చెప్పాలి. ఇంత మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు డైరెక్టర్ వేణు పై పెద్ద ఎత్తున ప్రశంసల కురిపించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఈ సినిమా సన్నివేశాన్ని స్కిట్ చేశారు.

 

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమోలో తాగుబోతు రమేష్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ వంటి ఇతర కమెడియన్లు ఈ సినిమాలోని కొమరయ్య చనిపోయే ఎమోషన్ సన్ని వేషాలను స్పూఫ్ చేశారు.ఇలా సినిమాలో ఎమోషన్ సన్ని వేషాలను ఇలా వీరు ఇక్కడ కామెడీ చేశారు. అది కూడా డైరెక్టర్ వేణు ముందు ఈ విధమైనటువంటి కామెడీ చేయడంతో పలువురు ఈ స్కిట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

రష్మీ గురించి పటాస్ ప్రవీణ్ పాట పాడుతూ.. అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమాలో అందరి హృదయాలను కదిలించిన సన్నివేశాలను జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కలిసి కామెడీ చేయడంతో పలువురు ఈ ప్రోమో పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 30 తేదీ ప్రసారం కానుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -