Actress Poorna: ఆ వార్తలు తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన పూర్ణ!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం వెండితెరకు హీరోయిన్ గా దూరమైనప్పటికీ కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అలాగే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. దుబాయ్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని వీరిద్దరిది పెద్దలు కుదుర్చున వివాహమని తెలియజేశారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు తనకు పెళ్లి సంబంధాలు చూడటం కోసం ఒక మ్యారేజ్ కన్సల్టెన్సీ గ్రూపుతో మాట్లాడమని అయితే పెళ్లికి సంబంధించిన కొన్ని వ్యవహారాలలో మా నుంచి పెద్ద ఎత్తున డబ్బును లాగే ప్రయత్నం చేసి మమ్మల్ని మోసం చేయాలని చూశారంటూ పూర్ణ ఈ సందర్భంగా వెల్లడించారు. మేము వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని తెలిపారు.

ఈ విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి పూర్ణ పెళ్లి విషయంలో పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారని, ఆ వార్తల కారణంగా తాను తీవ్రమైన మనస్థాపానికి గురయ్యానని ఈ సందర్భంగా పూర్ణ తెలిపారు. అయితే ఈ వార్తలు కేవలం మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా వైరల్ అయ్యాయి. అయితే నేను ఇలా మ్యారేజ్ కన్సల్టెన్సీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంతోమంది మోసపోకుండా జాగ్రత్త పడ్డారని ఈమె తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -