Pragathi: గాసిప్ సైట్ కన్నా ఘోరంగా సాక్షి.. వైరల్ అవుతున్న ప్రగతి సంచలన వ్యాఖ్యలు!

Pragathi: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఇష్టానుసారంగా వారు మాట్లాడటం మొదలుపెట్టారు. వారికి నచ్చిన కామెంట్స్ చేసుకుంటూ పోతున్నారు తప్పితే అవతలి వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకోవడం లేదు. దానివల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది హార్ట్ అవుతున్నారు, అలాగే మనం స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ నిజమా కాదా అనేది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు.

ఇదే విషయం గా కొందరు సెలబ్రిటీలు పక్క వాళ్ళతో చెప్పుకొని బాధపడుతూ ఉంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం తమదైన స్టైల్ లో ఫైర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నటి ప్రగతి చేస్తున్న పని అదే. సాక్షి పత్రిక మీద తెగ సీరియస్ అవుతుంది ప్రగతి ఆంటీ. ఇంతకీ విషయం ఏమిటంటే నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ వరుసగా స్టోరీలు రాస్తుంది సాక్షి పేపర్. ఒక స్టార్ నిర్మాతను లైన్ లో పెట్టేసారని, పెళ్లి చేసుకుంటారు అని కూడా రాయడం ప్రారంభించింది.

ఊరు పేరు లేని సైట్స్ రాస్తే పట్టించుకోరేమో కానీ సాక్షి లాంటి పేపర్ లో న్యూస్ వస్తే అది హైలెట్ అయ్యి తీరుతుంది. అలాగే ఈ న్యూస్ ఆ నోట ఈ నోట చేరి విషయం నటి ప్రగతి వరకు వెళ్ళింది. వెంటనే ఆమె స్పందించారు, చెప్పాల్సిన భాషలో ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. ప్రగతి ఏం మాట్లాడింది అనే విషయాన్ని పక్కన పెడితే ఆమె మాట్లాడిన భావం మాత్రం సిగ్గు ఎగ్గులేని బ్రతుకు బతికినా ఒకటే బతకపోయినా ఒకటే అని చెప్పుతో కొట్టినట్లుగా చెప్పినట్లు అయింది.

సాక్షి మీడియా గతంలో కూడా గాయని సునీత విషయంలో చేసిన ప్రచారంతో కేసులైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా స్వాతి రెడ్డి కూడా తను పడిన మానసిక క్షోభను సభాముఖంగా తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంత జరిగినా కూడా ఎవరేమనుకుంటే నాకేంటి అంటూ సాక్షి ఏమాత్రం తగ్గకుండా గాసిప్ సైట్ కన్నా ఘోరంగా తన పని తాను చేసుకుపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -