Sri Reddy: పవన్ కళ్యాణ్ కు బాటా చెప్పు చూపిస్తూ తన స్టైల్లో బూతు పురాణం అల్లిన శ్రీరెడ్డి?

Sri Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై తన ఫోకస్ పెట్టారు. అయితే తాజాగా వైసిపి మంత్రులపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయిన విషయం మనకు తెలిసిందే. తనని ప్యాకేజి స్టార్ అనిమూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఎప్పుడు వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే మొదటిసారి ఈ విషయాలపై పవన్ స్పందించారు.

ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎదవల్లారా సన్నాసుల్లారా నన్ను ప్యాకేజి స్టార్ అంటే చెప్పు తీసుకు కొడతా అంటూ చెప్పు చూపించిన విషయం తీవ్రస్థాయిలో వివాదంగా మారింది. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఏంటి మీరు కూడా చేసుకోండి అంటూ సమాధానం చెప్పారు.ఇలా చెప్పు చూపించిన కొన్ని గంటలకే ఈయన తిరిగి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడంతో వైసిపి మంత్రులు మరోసారి రెచ్చిపోయారు.

ఇక పవన్ కళ్యాణ్ ఇలా వీరావేశంతో చెప్పు చూపించి మరీ మాట్లాడటంతో రంగంలోకి శ్రీ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లైవ్ లో మాట్లాడుతూ తనదైన స్టైల్ లో పవన్ కళ్యాణ్ పై బూతు పురాణం అల్లింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఏకంగా బాట చెప్పు చూపిస్తూ ఇది చాలా స్ట్రాంగ్ ఇది తెగేవరకు కొడితే మామూలుగా ఉండదు అంటూ తిట్ల పురాణం మొదలు పెట్టింది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రౌడీయిజానికి టైం దగ్గర పడింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా వైసిపి మంత్రులపై చెప్పు చూపించి మాట్లాడటంతో ఇది ప్రజాస్వామ్యమ ఇంకేమైనానా? చెప్పులు చూపించి రౌడీయిజం చూపిస్తారా మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే. రాళ్లతో వస్తారా రాడ్ లతోవస్తారా అంటావా నువ్వు ఆ బొల్లిగాడు కలిసి నాటకాలు ఆడుతున్నారా అసలు వైజాగ్ లో నీకేం పని. నీకంటూ ఒక జెండా లేదు.. ఒక అజెండా లేదు ఆ బొల్లి గాడు ఏం చెబితే అదే చేస్తావ్. పవన్ కళ్యాణ్ నేను నీకు ఒకటే చెబుతున్నా నిన్ను ప్రాణాలతో కాపాడేది కేవలం జగనన్న మాత్రమే లేదంటే టిడిపి వాళ్లు వంగవీటిని ఎలాగైతే లేపేసారో నిన్ను కూడా అలాగే లేపుతారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -