Actress Sudha: టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ చనిపోయి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆయనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటి సెలబ్రిటీలకు ఆయనతో కలిసి పనిచేసిన సెలబ్రిటీలకు కూడా ఇంటర్వ్యూలలో సినిమా ప్రమోషన్స్ సమయంలో ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఆయన మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఉదయ్ కిరణ్ గురించి ఏం మాట్లాడుతూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి సుధ కూడా ఉదయ్ కిరణ్ ని తలుచుకొని కన్నీరు పెట్టుకుంది. దసరా నవరాత్రుల సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక స్పెషల్ షోకి ఈమె అతిథిగా వచ్చారు. ఈ షోలోనే ఉదయ్ కిరణ్ ఫోటో పట్టుకొని ఎమోషనల్ అయ్యారు. కాగా ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో సుధా కూడా నటించింది అన్న విషయం తెలిసిందే. ఎక్కువ సినిమాల్లో ఉదయ్ కిరణ్ కి తల్లిగా కూడా కనిపించారు. కాగా షోలో భాగంగా ఒక సందర్బంలో ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూ.. ఒకవేళ వాడు నా కడుపున పుట్టుంటే ఇంకా బ్రతికి ఉండేవాడేమో అంటూ ఎమోషనల్ అయ్యారు.
సుధనీ చూసి షోలో వారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇటీవల సీనియర్ నటుడు మురళి మోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఒక సూపర్ హిట్ సినిమా మిస్ చేసుకున్నట్లు తెలియజేశాడు. మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సిందట.