Pawan Kalyan: ఈ మధ్యకాలంలో టాక్ షోలకి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాకుండా అ ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా టాక్ షో లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇకపోతే హాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారమవుతూ రికార్డులను కొల్లగొడుతూ వీడియోస్ ని రాబట్టింది. అంతేకాకుండా ఈ టాక్ షో ద్వారా బాలయ్య బాబు తనలో ఉన్న మరొక టాలెంట్ ని అభిమానులకు పరిచయం చేశారు.
వీటితోపాటు కాదు తెలుగులో ఇంతకుముందే పలు టాక్ షోలు వచ్చినప్పటికీ ఏ షోకి రాని గుర్తింపు బాలయ్య బాబు వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో కి దక్కిందని చెప్పవచ్చు. అయితే ఈ షో బాగా క్లిక్ అవడంతో ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా పవన్ కళ్యాణ్ తో ఒక టాక్ షో నిర్వహించబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి చర్చలు కూడా నడిచాయని త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక టాక్ షోని ప్రారంభించబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ షో కి సత్యమేవ జయతే అనే టైటిల్ పెడితే బాగుండు అని అనుకుంటున్నారట.
అయితే ప్రస్తుతం సమయంలో పవన్ కళ్యాణ్ టాక్ షో నిర్వహించడం వల్ల ఆయనకు సినీ కెరియర్ పరంగా అలాగే రాజకీయపరంగా ప్లస్ అవుతుందని ఆహా నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ తో కలిసి టాక్ షో నిర్వహించినట్లయితే ఆ టాక్ షోకి భారీగా క్రేజ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ టాక్స్ నిర్వహిస్తే బాగుంటుంది అని అభిమానులు కామెంట్స్ రూపంలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.