Ajith: అటు పవన్ కళ్యాణ్ ను ఇటు చిరంజీవిని ముంచేసిన అజిత్.. ఏం జరిగిందంటే?

Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తమిళంలో నటించిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్.అయితే తమిళంలో అజిత్ నటించిన సినిమాలను వీరిద్దరూ తెలుగులో రీమేక్ చేయగా మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా అట్టర్ ఫ్లాప్ మూట కట్టుకున్నారు. తమిళంలో అజిత్ నటించిన వీరం సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

వీరం సినిమా తమిళంలో కూడా పెద్దగా సక్సెస్ సాధించలేక పరవాలేదు అనిపించింది అలాంటి సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం మంచిది కాదు అంటూ అభిమానులు ఎంత మొత్తుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం కాటమరాయుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇలా తమ్ముడు వంతు అయి పోగానే అన్నయ్య వంతు వచ్చింది.

 

2015 వ సంవత్సరంలో అజిత్ వేదాలం సినిమాని చేశారు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది గాని సూపర్ హిట్ అనే టాక్ మాత్రం సొంతం చేసుకోలేదు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్న తరుణంలో చిరంజీవి భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు. 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మెహర్ రమేష్ ఈ సినిమా ద్వారా కొత్తగా ఏమి ప్రేక్షకులకు చూపించలేదు.

 

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఏది ఏమైనా హీరో అజిత్ ను నమ్ముకున్నటువంటి మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా మునిగిపోయారని ఈ రెండు సినిమా ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా మెగా హీరోలు రీమేక్ సినిమాలపై కాకుండా సొంతంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని మెగా ఫాన్స్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -