Akkineni Heroes: తమిళ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అక్కినేని హీరోలు… ఇదంతా యాదృచ్ఛికమేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సినీ కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య అఖిల్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని వారసులు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారులు నాగచైతన్య అఖిల్ ఈ ముగ్గురు కూడా వారి తదుపరి సినిమాల ఎంపిక విషయంలో ఓకే ఆలోచన చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అయితే ఈ ముగ్గురు అనుకోని ఇలా చేశారా లేకపోతే ఆదృచ్ఛికంగా చేశారో తెలియదు కానీ ఈ ముగ్గురు హీరోలు తమ తదుపరి సినిమాలను ఏకంగా తమిళ డైరెక్టర్ల చేతిలో పెట్టారు.

థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య తన తదుపరి సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. ఇక తాజాగా నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం తన 100వ చిత్రాన్ని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారట.

ఈ క్రమంలోనే నాగార్జున తన వందవ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.గాడ్ ఫాదర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న మోహన్ రాజా నాగార్జున 100 సినిమాకి డైరెక్టర్ గా మారారు.ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నటువంటి అఖిల్ తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. తమిళ డైరెక్టర్లకు సినిమా అవకాశాలను ఇచ్చారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే తమిళ డైరెక్టర్లతో కమిట్ అయ్యారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -