Alekhya Reddy: నందమూరి తారకరత్న ఇక లేరన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. నందమూరి కుటుంబం మాత్రం ఆయన ఆలోచన నుండి బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలు మాత్రం ఆయన ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పటికీ అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. ప్రతిరోజు తన భర్త తారకరత్నకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ అవుతూ ఉంది. అయితే తాజాగా ఆమె మరొక పోస్ట్ షేర్ చేయగా ఆ పోస్ట్ కన్నీళ్లను పెట్టించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంతకు ఆమె ఏం పంచుకుందంటే..
అందులో బాలయ్య తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయగా.. ఆ ఫోటోలో తారకరత్నను మార్ఫింగ్ చేసిన ఫోటో కూడా ఉంది. ఇక ఆ ఫోటో పంచుకుంటూ అలేఖ్య రెడ్డి ఈ విధంగా పంచుకుంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి.. మంచి, చెడు ఏదైనా కానీ అవి పూర్తిగా సమసి పోయే వరకు రాయిలా మాకు అడ్డు నిలబడ్డ వ్యక్తి.. ఆస్పత్రికి తీసుకెళ్లే వేళ తండ్రిలా.. నీ బెడ్ పక్కనే కూర్చుని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా..
నిన్ను నవ్వించడం కోసం జోకులు వేస్తూ సరదాగా కనిపించి ఎవరు చూడనప్పుడు నీకోసం కన్నీరు పెట్టుకున్న బాంధవుడు.. అన్నివేళలా ఆయన మన వెంటే ఉన్నారు. నీవు మరి కొంతకాలం మాతో ఉండి ఉంటే బాగుండేది.. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఒరిజినల్ ఫోటోలో ఓబును మార్కింగ్ చేసిన వాళ్లకు ధన్యవాదాలు అని పంచుకుంది. అంటే బాలయ్య తమకు అన్నివేళలా తోడు ఉన్నాడని.. నువ్వు కూడా ఉంటే బాగుండేది అన్నట్లు ఆమె పోస్టు అందర్నీ బాధ పెట్టేలా చేసింది.