Allu Sirish: అల్లు అర్జున్ అంత మాట అన్నాడా?.. ఇంటి నుంచి వెళ్లిపోయిన శిరీష్!

Allu Sirish: అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంతలా ఎదిగిపోయాడో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మెగా జపం చేసేవాడు. తన మామ చిరంజీవి గురించి ఎంతో గొప్పగా చెప్పేవాడు. తనకు చిరంజీవి కంటే ఎవ్వరూ ఎక్కువ కాదని అనేవాడు. అల్లు అర్జున్ ఎదిగింది కూడా మెగా నీడలోనే. నిల్చుంది మెగా నీడలోనే.అయితే అల్లు అర్జున్‌కు ఇప్పుడు సక్సెస్ తలకెక్కినట్టు కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో అల్లు అర్జున్ ఎక్కడా కూడా మెగా ట్యాగ్ వాడటం లేదు.

మెగా హీరో అని కూడా అనిపించికునేందుకు అల్లు అర్జున్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతోన్నారట. అల్లు అర్జున్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారట. అల్లు అనే బ్రాండ్‌ను ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని బన్నీ చూస్తున్నాడు. అందుకే అల్లు నామ జపం చేస్తున్నాడు. అల్లు స్టూడియో కడుతున్నాడు.

అయితే ఇప్పుడు అల్లువారింట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయట. అల్లు శిరీష్.. ఇంట్లోంచి వెళ్లిపోయాడట. ఇంటికి దూరంగా ఉంటున్నాడట. అసలే అల్లు శిరీష్ గత కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నాడు. హైద్రాబాద్‌లో ఉన్నా కూడా సపరేట్‌గా ఉంటున్నాడని తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఒంటరిగా తాను పడ్డ కష్టాల గురించి ఫన్నీ వీడియోలు పెడుతుండేవాడు.

అల్లు అర్జున్ గానీ, అల్లు అరవింద్ గానీ అల్లు శిరీష్‌ను పట్టించుకోవడం లేదట. అల్లు శిరీష్ తన అన్న బన్నీ కోసం చేసిన త్యాగాలను, కెరీర్ ప్రారంభంలో చేసిన సాయాలు కూడా గుర్తించడం లేదట. అందుకే అల్లు శిరీష్ ఇంటికి దూరంగా ఉంటున్నాడట. అయితే బన్నీ ఇప్పుడు మెగా ట్యాగ్, చిరంజీవినే గుర్తించేలా లేడు.. ఇక అల్లు శిరీష్‌ను ఏం పట్టించుకుంటాడంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -