Alwar: 15 ఏళ్ల బాలికపై మేనమామ అత్యాచారం.. అనంతరం స్నేహితులతో కలిసి అలా?

Alwar: సమాజంలో రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోడ్డుపై మహిళలు కనిపిస్తే చాలు కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇంకొందరు అయితే వావి వరసలు మరిచి కన్న కూతుర్ని సొంత చెల్లెలిని కూడా విడిచి పెట్టకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వం కామాంధులకు సరైన విధంగా అడ్డుకట్ట వేయలేకపోవడంతో కామాంధులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా తరచూ పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక 15 ఏళ్ల బాలికపై మేనమామ ప్రచారం చేయడంతో పాటు అంతటితో ఆగకుండా మరింత దారుణానికి ఒడిగట్టాడు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం మరో ప్రదేశానికి వెళ్లడంతో కూతురిని మేనమామ ఇంట్లో వదిలి వెళ్లిపోయారు. కోడలిపై ఎప్పటి నుంచో కన్నేసిన మేనమామ ఎలాగైన బాలికతో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇక అతడు అనుకున్న రోజు కూడా రానే వచ్చింది. ఇటీవలె ఆ బాలిక మేనమామ ఆ యువతిని బలవంతంగా ఓ గదిలో బంధించాడు. అనంతరం కోడలిపై ఆ మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ఆ మేనమామ అంతటితో ఆగకుండా మరింత దారుణంగా ప్రవర్తించాడు.

 

బాలికను అదే గదిలో నాలుగు రోజుల బంధించి తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని తట్టుకోలేని ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు ఆలస్యంగా వివరించింది. ఇక కూతురు మాటలు విన్న ఆ బాలిక తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -