Anasuya Bharadwaj: వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్!

Anasuya Bharadwaj: జబర్దస్త్‌ షో చేస్తూనే సినిమాల్లో ఆఫర్లు అందుకున్న అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అనేక పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొన్ని కాంట్రవర్సీల్లోనూ అనసూయ ముందుంటుంది. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెబుతుండడంతో కొందరు వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తుంటే వాటికి ధీటుగా రిప్లై ఇస్తుంది అనసూయ. ప్రస్తుతం వెండితెర ఆఫర్లతో బిజీగా ఉంటోంది అనసూయ.

పుష్ప మూవీతో పాటు అనేక సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఇటీవల అనసూయ స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ నిర్మిస్తున్న టెర్రస్ లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌కు సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో ప్రమోషన్ చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి అనసూయ ఆ వీడియోలో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అనేక ఆసక్తికర విషయాలు అందులో పంచుకున్నారు.

టెర్రస్‌ లవ్‌ స్టోరీ గ్లింప్స్‌ను తాను చూశానని, బాగా నచ్చిందని తెలిపింది అనసూయ. అయితే, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అలాంటి లవ్‌స్టోరీ లేదని క్లారిటీ ఇచ్చింది అనసూయ. తాను చాలా పద్ధతిగా ఉంటానని, మేడపైకి వెళ్లి బట్టలు తీసుకొని వచ్చేదాన్నని అనసూయ చెప్పింది. తన తండ్రి చాలా పద్ధతిగా పెంచారని తెలిపింది. తాము ముగ్గురం ఆడ పిల్లలమని, నాన్న రాజకీయాల్లో తిరిగే వారని చెప్పుకొచ్చింది.

బట్టలు తడుపుకొని ఇలా చేస్తుంటారు..
తన జీవితంలో ఇలాంటి టెర్రస్‌ ప్రేమ కథ లేకపోయినా, ఈ కథను చూసి చాలా ఆనందించానని చెప్పింది. అనేక విషయాలు తెలుసుకున్నానని తెలిపింది. మీలో చాలామంది పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్ల కోసం చుప్‌కీ చుప్‌కీ పైకి వెళ్లి బట్టలను తడిపి మరీ ఎండేసిన సందర్భాలు ఉంటాయంటూ అనసూయ హాట్‌ కామెంట్స్‌ చేసింది. మన నిత్య జీవితంలో జరిగిన వాస్తవ ఘటనలనే సినిమాల్లో చూపుతారని పేర్కొంది. ఇలా సినిమాల్లో చూపేవన్నీ నిజ జీవితంలో కూడా కొందరికి జరుగుతాయని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -