Anasuya: అనసూయ సంచలన పోస్ట్.. వాళ్లు గుర్తొస్తున్నారంటూ?

Anasuya: జబర్దస్త్ షో తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంకర్ గా అనసూయ మంచి గుర్తింపు అందుకుంది. బుల్లితెర స్టార్ యాంకర్ స్టేజి నుంచి క్రమంగా ఎదిగిన అనసూయ ఇప్పుడు వెండితెర పై కూడా బాగా రాణిస్తోంది.

తన మాటలతో ,నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం అనసూయకు వెన్నతో పెట్టిన విద్య.
కెరీర్ తొలి దశలో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ గా పనిచేసిన అనసూయ క్రమంగా పలు సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ గుర్తింపు సంపాదించండి. ఈటీవీ జబర్దస్త్ యాంకర్ గా చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా మారిందని చెప్పవచ్చు. అప్పటివరకు రాని గుర్తింపు కేవలం ఈ ఒక్క షో వల్ల అనసూయకు వచ్చింది.

 

ఇటు బుల్లితెరపై , అటు వెండితెరపై తన ప్రతిభను చాటిన అనసూయ పలు వెబ్ సిరీస్ లో కూడా చేస్తుంది.
ఇటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అనసూయ యాక్టివ్ గా ఉంటుంది. అనసూయ తనకు సంబంధించిన ఫోటో లను, డాన్స్ వీడియో లను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటుంది.

ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ పొగడ్తలతో పాటు నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అనసూయ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన అప్డేట్స్ కు బాగానే నెగటివ్ ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో వీటి గురించి అసలు పట్టించుకోని అనసూయ ఇప్పుడు మాత్రం ఘాటుగా వీటికి జవాబు ఇస్తుంది.

ఈ నేపథ్యంలో అనసూయ రీసెంట్ గా తనపై ట్రోల్ చేసిన వ్యక్తిని అరెస్టు కూడా చేయించింది. ఇందులో భాగంగానే తన ఇన్స్టాలో ఆమె ఒక స్టోరీని కూడా పంచుకోండి. ‘ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారో ఆ పాపులకు దూరంగా ఉండాలి ‘అంటూ స్టోరీని పోస్ట్ చేసి కింద ‘కొందరు గుర్తుకొస్తున్నారు ‘అంటూ ఆమె పెట్టిన కామెంట్ బాగా వైరల్ అయింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -