Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థానంలో గోపీచంద్.. అలా చేస్తే మాత్రం క్రిష్ కెరీర్ కు ప్రమాదమంటూ?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను సెట్స్ మీదకి తీసుకువచ్చి చాలా కాలం అయింది. గత రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా విడుదల తేదీపై ఊహించని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎప్పుడో రావలసిన సినిమా ఇది అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అసలు కరోనా రావటమే ఈ సినిమాకి పెద్ద గ్యాప్, తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలు కారణంగా మరికొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

ఇప్పుడు మళ్లీ 2024 వేసవి వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని పవన్ కళ్యాణ్ చెప్పడంతో సందిగ్ధంలో పడ్డాడు క్రిష్. హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నట్లు ముందుగా తెలిసిన విషయమే. దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ లేకపోయినప్పటికీ కొన్ని సన్నివేశాలని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ సినిమా ముందుకి కదలకపోవటం, వచ్చే వేసవి వరకు పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరకపోవడంతో..

ఈ గ్యాప్ లో హీరో గోపీచంద్ తో మరొక మూవీ ని డైరెక్ట్ చేయటానికి ప్లాన్ చేశాడంట క్రిష్. అయితే ఇది సినీ వర్గాల భోగట్టా మాత్రమే. క్రిష్ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఒక సినిమా చేస్తూ దాని మధ్యలో మరొక సినిమాని డైరెక్ట్ చేయడం వలన క్రిష్ కెరియర్ కి ప్రమాదం ఏర్పడవచ్చు అంటున్నారు పరిశీలకులు. గమ్యం సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీలు కాకుండా..

డిఫరెంట్ గా గౌతమీపుత్ర శాతకర్ణి, కథానాయకుడు, కృష్ణం వందే జగద్గురుం వంటి సినిమాలు తీసి విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన దర్శకుడు. ఇతను హిందీ సినిమా మణికర్ణికను కూడా డైరెక్ట్ చేసాడు. కానీ కంగనా రౌనత్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో కంగనా తో పాటు ఆమె సోదరి కూడా ఇతనిపై దాడికి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇంతటి టాలెంటెడ్ దర్శకుడి కెరియర్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో తెలియాల్సిందే

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -