Prabhas Kalki: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు K మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతుందని విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్ K ని కల్కి 2898 AD గా మార్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే తెలుసుకోవలసిన విషయము.. ప్రభాస్ ఫాన్సీ కి షాకి చ్చే విషయం ఏంటంటే కల్కి మూవీ ముందు వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు.
కానీ ఈ తేదీని పోస్ట్ పోన్ చేసి 2024 మే 9న సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిత్ర నిర్మాత అశ్విని దత్ స్వయంగా సినిమా విడుదల తేదీని మార్చినట్లు పలు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా పోస్ట్ పోన్ చేయడానికి కారణం తెలుస్తోంది సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎక్కువగా గ్రాఫిక్స్ నిర్మాణ విలువలు ఉంటాయి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.
కానీ మరి కొంతమంది వైజయంతి మూవీస్ కి ఉన్న సెంటిమెంట్ కూడా మరొక కారణం అంటున్నారు. గతంలో ఈ బ్యానర్ లో మే తొమ్మిదో తేదీన విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు ఘనవిజయాలని అందుకున్నాయి. అదే సెంటిమెంటు కల్కి మీద కూడా వాడబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి మహానటులు ఈ సినిమాల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిప్స్ వీడియో దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. భారతీయ పురాణాల స్ఫూర్తితో సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు నాగ అశ్విన్. అయితే గ్లింప్స్ చూసి ఎప్పుడు ఎప్పుడు సినిమా చూద్దామా అన్న ప్రేక్షకులు సినిమా డేట్ పోస్ట్ ఫోన్ అవటంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.’