Ram Charan Upasana: ఆ పూజ చేయడం వల్లే చరణ్ ఉపాసనలకు పిల్లలు పుట్టారా?

Ram Charan Upasana: మెగా కోడలు ఉపాసన ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ – ఉపాసన వివాహాం జరిగిన పది సంవత్సరాలకు వారికి పాప జన్మించింది.  గతేడాది డిసెంబర్లో ఉపాసన గర్భం దాల్చిన సంగతి చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇటీవల జూన్ 20వ తేదీ తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  ఈ మేరకు మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెగా వారసురాలు పుట్టిన సందర్భంగా మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.
రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు వారు తల్లిదండ్రులైన సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు మెగా అభిమానులు కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తాజాగా 23 వ తేది పాపకి వెల్కం చెప్పటానికి చిరంజీవి నివాసం అందంగా ముస్తాబు అయ్యింది.

 

 

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు పాప జన్మించడానికి గల కారణం గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇదిలా రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా బాధపడ్డారు. అందువల్ల వారి జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా అని చిరంజీవి గతంలో ఓ జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు.

 

రామ్ చరణ్ జాతకం చూసిన జ్యోతిష్యుడు రామ్ చరణ్ తో ప్రతి సోమవారం శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని చిరంజీవికి తెలిపాడు. దాంతో చిరంజీవి రామ్ చరణ్‌తో గత రెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న దామకొండలో ఉన్న ఒక ప్రముఖ శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించేవాడట.అలా ఆ శివలింగానికి అభిషేకం చేయడం వల్లే రామ్ చరణ్ కు పిల్లలు పుట్టారని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -