Posani Krishna Murali: ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అనే కామెంట్లు.. పోసాని విమర్శల్లో కొంచమైనా అర్థముందా?

Posani Krishna Murali: రాజకీయాల అన్నాక ఒక పార్టీని మరొక పార్టీ విమర్శించడం నేటి రోజుల్లో కామన్. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి జగన్ దగ్గర ఎలాంటి కంటెంట్ లేకపోవడంతో ఆయన భార్యల మీద తన ప్రతాపం చూపిస్తూ ఉంటారు మన జగన్ మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ భార్య అని ఉంటే గౌరవంగా ఉండేది పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్ళాలు అనే ప్రస్తావన తీసుకు రావటం అనేది ఆడవాళ్ళని అవమానించినట్లే అవుతుంది.

రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేసినా అది రాజకీయాలలో కొట్టుకుపోతుంది కానీ మధ్యలో ఆయన భార్యలు ఏం చేశారని వారిని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. జీవితంలో అన్నీ అనుకున్నవి జరగవు నా నుంచి విడాకులు తీసుకున్న ఆడబిడ్డల్ని అవమానిస్తావా, వాళ్లని కార్లతో పోలుస్తావా..

నీ భార్య భారతి గారిని పెళ్ళాం అంటే బాగుంటుందా అంటూ నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. అయితే ఈ పాయింట్ పట్టుకొని తెల్లారేసరికి మీడియా ముందుకు వచ్చేసాడు మెంటల్ కృష్ణ పోసాని కృష్ణ మురళి. ముఖ్యమంత్రి భార్యను పట్టుకొని పెళ్లామంటావా ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటావు అంటూ విరుచుకుపడ్డాడు.

అయితే ఆయన అన్నమాటలు జగన్ కి కూడా వర్తిస్తాయి అని మర్చిపోయినట్లు ఉన్నాడు పాపం మెంటల్ కృష్ణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం ఉదాహరణ కోసం మాట్లాడారు తప్పితే జగన్ లాగా పదేపదే పెళ్ళాలు అని అసభ్యంగా మాట్లాడలేదు. ఏ మాత్రం ప్యాకేజీ తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మీద లేనిపోని ఆరోపణలు చేశాడు. ఇదే పోసాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని కొనే అంత దమ్ము ఎవరికీ లేదు అంటూ పబ్లిక్ గా చెప్పటం గమనార్హం. విమర్శించడానికి కంటెంట్ దొరక్క ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వైసీపీని ఏమనాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -