Pawan Kalyan: చిరంజీవి జోలికి వస్తే సహించేదిలేదు.. పవన్ మాస్ వార్నింగ్ తో సైలెంట్ అవుతారా?

Pawan Kalyan:  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ వీడియో పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు చిరంజీవి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైసిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించినటువంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి గురించి సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మా అన్నయ్య చిరంజీవి జోలికి వస్తే అసలు సహించనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు. రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ సింహం కాదు.. గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు అధికారం ఎక్కువైందని మాట మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలంటూ పవన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సజ్జల మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ ఈయన వైసీపీ నేతలకు తనదైన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -