Celebrities: ఈ సెలబ్రిటీలు పిల్లలు పుట్టినవాళ్లను పెళ్లి చేసుకున్నారా?

Celebrities: సినీ ఇండస్ట్రీ అంటేనే అదో రంగుల ప్రపంచం. రంగులు వేసుకొని క్యారెక్టర్ అయిపోయిన తర్వాత తీసివేసినట్లే.. వారి జీవిత భాగస్వాములను మార్చేస్తున్నారు. ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్ అయిపోయాయి. ఎవరితో అయినా ఇట్టే ప్రేమలో పడతారు అంతే వేగంగా విడాకులు తీసుకుంటున్నారు.

బంధాలకు, ఎమోషన్స్ కి వాల్యూ లేదు. ఇవి కేవలం పుస్తకాలకే పరిమితం అయ్యాయి. ఇండస్ట్రీలో అందుకే చాలా మంది హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నారు. అంటే పెళ్లయ్యాక సినిమాలు ఆపేయాలని కండిషన్ పెడతారు. ఇక ఇప్పుడు విచిత్రం ఏమిటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత సదరు పిల్ల తల్లులని కొంత మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లైన అమ్మాయిలను మాత్రమే కాకుండా పిల్లలు పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హీరోలు ఎక్కువ మందే ఉన్నారు.

 

భూమా దంపతుల చిన్న కుమార్తె మౌనిక రెడ్డికి గతంలో వివాహం జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని మనస్పర్ధలు కారణంగా మౌనిక విడాకులు తీసుకొని ఒంటరిగానే ఉంటుంది. మంచు మనోజ్ సైతం ప్రణీత రెడ్డితో వివాహం జరిగాక మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉం టున్నాడు. కుటుంబాల మధ్య ముందు నుంచే సఖ్యత ఉండడంతో ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

 

చిరంజీవి రెండో కుమార్తె అయిన శ్రీజ గతంలో వేరొక వ్యక్తితో పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తె పుట్టింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సమస్యలు వచ్చాయి. దీంతో
విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైన కళ్యాణ్ దేవ్ నీ మరోసారి ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రీజ. కళ్యా ణ్ దేవ్ మెగా ఇంటికి అల్లుడు అయ్యాక సినిమాల్లో హీరోగా వచ్చాడు. కానీ ప్రస్తుతం ఈ జంట కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.

 

రాధిక రెండుసార్లు వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత మూడోసారి శరత్ కుమార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. రాధికకు అప్పటికే ఓ కుమార్తె కూడా ఉంది. అయినా కూడా శరత్ కుమార్ తో పెళ్లి జరగగా వారికి ఓ కుమారుడు జన్మించాడు. గౌతమికి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాలం నుంచి కమల్ హాసన్ తో పరిచయం ఉంది. అయితే గౌతమి వేరొక వ్యక్తితో పెళ్లి చేసుకుని సుబ్బలక్ష్మి అనే కుమార్తెకు జన్మనిచ్చింది. తర్వా త
విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సమయంలో కమల్ తో మరోసారి ప్రేమలో సహజీవనం చేశారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -