Comedian Lakshmipathi: ఇండస్ట్రీ నుంచి లక్ష్మీపతి కూతురికి సాయం చేసింది వాళ్లు మాత్రమేనా?

Comedian Lakshmipathi: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి దివంగత కమెడియన్ లక్ష్మీపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు లక్ష్మీపతి. ఇక తెలుగులో ఆంధ్రుడు, కితకితలు, అల్లరి, పెదబాబు లాంటి ఎన్నో సినిమాలలో నటించారు లక్ష్మీపతి. కానీ ఊహించని విధంగా లక్ష్మీపతి 2008 లోనే మరణించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే లక్ష్మీపతి కూతురు శ్వేత తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నాన్న యాక్టింగ్ పై మక్కువతో ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత అక్కడ సక్సెస్ అయ్యారు అని తెలిపింది శ్వేత. ఫ్యామిలీ కారణాలవల్లే నాన్న అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపింది శ్వేత. మా నాన్నకు బాబాయ్ కు మధ్య మంచి బంధం ఉండేది. అయితే అప్పట్లో నేను మా నాన్నకు ఏదైనా సలహా ఇస్తే మా నాన్న కాస్త కామెడీగా మాట్లాడేవారు అని చెప్పుకొచ్చింది శ్వేత. ఆ తర్వాత తన తండ్రి మరణం తనను ఎంతగానో బాధించిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.

 

అలాగే తన తండ్రి చనిపోయిన సమయంలో కేవలం ఇండస్ట్రీ నుంచి ముగ్గురు వ్యక్తులు మాత్రమే సహాయం చేసినట్లు ఆమె తెలిపిందే. వారు మరెవరు కాదు హీరో ప్రభాస్, మహేష్ బాబు, అజయ్. ఆ ముగ్గురు మాత్రమే తనకు సహాయం చేసినట్టు చెప్పుకొచ్చింది శ్వేత. తండ్రి మరణం తర్వాత ఆమె నాలుగేళ్ల పాటు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలిపింది. కాగా ఇంటర్వ్యూలో భాగంగా శ్వేత చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -