Namakkal: దారుణం.. 300 మంది రోగులను చంపిన రాక్షసుడు?

Namakkal: తాజాగా ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో ఒక వ్యక్తి ఒకరు ఇద్దరిని కాదు ఏకంగా 300 మందిని చంపేశాడు. ఆ దారుణం తాజాగా వెలుగులోకి రావడంతో ఆ విషయం తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్ అనే 34 ఏళ్ళ వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోజూ తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ మార్చూరి వద్ద పనిచేసే వ్యక్తితో మాటలు కలిపి వారితో పరిచయం పెంచుకున్నాడు.

 

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18వ తేదీన సోషల్ మీడియాలో అతడు 300 హత్యలు చేసినట్లు మాట్లాడిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వీడియోలో అతను మాట్లాడిన ప్రకారం ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబ సభ్యులు, బంధువుల కోరికమేరకు విషపు ఇంజెక్షన్ వేసి హత్య చేసేవాడినని ఆ దుర్మార్గుడు అంగీకరించాడు. అలా చంపినందుకుగాను వారి నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో తెలిపాడు. ఇప్పటి వరకు ఇలా దాదాపు 300 లకు పైగా హత్యలు ఈ పదేళ్లలో చేసినట్లు మోహన్ రాజ్ అంగీకరించాడు.

 

ఈ తరహా పనులు చేసేందుకు చెన్నై, బెంగళూరుకు వెళ్లి మరి చేసేవాడినని అతడు తెలిపాడు. రూ.5 వేలు ఇస్తే కేవలం రెండు నిమిషాల్లో పని పూర్తి చేస్తానని అతడు తన నోటి ద్వారా స్వయంగా ఒప్పుకున్నాడు. అతడు మాట్లాడిన వీడియో వైరల్ గా మారి చివరకు పోలీసులకు చేరింది. దీంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ రాజ్ ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో అలా మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు 18 మంది నకిలీ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -