Fatehganj: దారుణం.. యువతిని నగ్నంగా మార్చి తండ్రి భర్త పైశాచికత్వం?

Fatehganj: తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన విలువలోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌, ఫతేఘంజ్‌ తాజాగా మంగళవారం ఉదయం అగరాస్‌ గ్రామ శివారు ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఒక యువతి నగ్నంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు చేరుకున్న పోలీసులు ఆయుతి ఇంకా బ్రతికే ఉందని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి కొద్దిగా కోలుకోవడంతో ఆమెను కొన్ని ప్రశ్నలు వేయగా మాట్లాడే స్థితిలో లేకపోవడంతో వెంటనే ఆమె చేతికి పెన్ను ఇచ్చి ఆమె వివరాలను రాయమని చెప్పారు.

ఆ యువతి తన పేరు మున్నీ దేవి అని, తన తండ్రి పేరు తోతారామ్‌ అని తనది తానాసాహి గ్రామం అని రాయడంతో యువతి చెప్పిన వివరాల ప్రకారం వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అక్కడికి ఆ యువతీకి కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్ బెడ్ పై అలా దారుణమైన స్థితిలో ఉన్న మున్నీ ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుగుతుండగా వారికి ఆ యువతి మరిదిపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మున్నీ తండ్రి, భర్త, మరిది కలిసి ఆమె యాసిడ్‌ దాడికి దిగినట్లు మున్నీ మరిది ఒప్పుకున్నాడు.

 

కాగా మున్ని అజయ్ అనే ఒక యువకుడిని ప్రేమిస్తోందని గతంలో రెండుసార్లు అతనితో ఇంటి నుంచి కూడా పారిపోయిందని, ఈ నేపథ్యంలో మున్నీ తండ్రి తోతారామ్‌, మున్నీని ఆమె బావ దేవేంద్రకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో తాజాగా తోతారామ్‌ మున్నీని తీసుకుని ఆమె అత్తారింటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మున్నీ తన భర్త ఫోన్‌ నుంచి ప్రియుడు అజయ్‌కి ఫోన్‌ చేసింది. తన ప్రియుడితో వెళ్లిపోతానని అత్తింటి వారితో గొడవ పెట్టుకుంది. తండ్రి, అత్తింటి వాళ్లు ఆమెకు ఎంతగానో నచ్చ చెప్పాలని చూశారు.

 

అయినా ఆమె వినలేదు. దాంతో ఎలా అయినా ఆమెను చంపాలి అని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు. అనుకున్నదే ఆలస్యం మున్నీని ఊరికి దూరంగా తీసుకొని వెళ్లి నగ్నంగా చేసి ముఖంపై ఒంటిపై యాసిడ్ దాడి చేశారు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోగా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న మున్నీ అక్కడినుంచి మెల్లగా నేలపై పాకుతూ రోడ్డు దగ్గరకు వచ్చింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -