Uttar Pradesh: నడిరోడ్డుపై కత్తితో మహిళపై దాడి.. చివరికి?

Uttar Pradesh: ప్రస్తుత సమాజంలో నిత్యం దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సంఘటనలు భయంకరంగా ఉంటే మరికొన్ని బాధ కలిగించేలా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయడం అన్నది సర్వ సాధారణమైపోయింది. ఎంతో సునాయాసంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా అటువంటి దారుణమైన ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఒక మహిళ నివాసం ఉంటుంది.

స్థానికంగా ఉండే రాజేష్ అనే యువకుడు గత కొన్నాళ్ల నుంచి ఆ మహిళను వేధించేవాడు. అయితే ఆ ఇల్లాలు కొన్ని రోజులు మౌనంగా భరించింది. ఇక రాను రాను రాజేష్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. రాజేష్ వేధింపులు తట్టుకోలేకపోయిన ఆ వివాహిత అతనిపై వేధింపుల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్నిరోజుల తర్వాత రాజేష్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినా బుద్ది మార్చుకుని రాజేష్ ఇటీవల మరోసారి ఆ మహిళను నడిరోడ్డుపై అడ్డుకున్నాడు.

 

తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఆ మహిళతో గొడవకు దిగాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగింది. దాంతో రాజేష్ ఆమెపై పట్టణానికి కోపంతో ఊగిపోయాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఆ మహిళ ముక్కుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గమనించిన కొందరు స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ మహిళ కుటుంబ సభ్యులు రాజేష్ పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -