Sri Reddy: బాబు చస్తేనే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్!

Sri Reddy: వైసీపీకి సపోర్ట్ గా వీడియోలు పెడుతూ టీడీపీ, జనసేన పార్టీలను శ్రీరెడ్డి విమర్శిస్తూ ఉంటుంది. రోజూ సోషల్ మీడియాలో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీని మరోసారి టార్గెట్ చేస్తూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించింది. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటుడని, చాలా టాలెంటెడ్ అని పేర్కొంది. అలాగే ఎలాంటి వివాదాలకు కూడా ఎన్టీఆర్ తావు ఇవ్వడని చెప్పుకొచ్చింది. తారక్ కు చాలా ఎథిక్స్ ఉన్నాయని, చాలా ధైర్యవంతుడని తెలిపింది.

పక్కా ప్లాన్ ప్రకారమే తన కెరీర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నాడని శ్రీరెడ్డి తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నా సరే ఇప్పుడు రావడం లేదని, కుటుంబ క్షేమం కోసం మాత్రమే ఆలోచించి వెనక్కి తగ్గుతున్నాడని శ్రీరెడ్డి తెలిపింది. కుటుంబంలో ఉన్న సమస్యలను ఎక్కడా బయటపెట్టకుండా ఎన్టీఆర్ లోపల మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని స్పష్టం చేసింది. చంద్రబాబు మరణం తర్వాత టీడీపీలో తుఫాన్ రావడం ఖాయమంది.

 

తాతగారి బ్రాండ్ ను కాపాడాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కుటుంబ విషయాలు బయటపెట్టడం లేదని శ్రీరెడ్డి చెబుతోంది. చంద్రబాబు మరణం తర్వాతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అరగ్రేటం చేస్తాడని, అప్పటివరకు సైలెంట్ గానే ఉంటాడని చెప్పింది. బాలయ్యను వియ్యంకుడిగా చేసుకోవడం వెనుక కూడా చంద్రబాబు మాస్టర్ స్కెచ్ ఉందని శ్రీరెడ్డి అంటోంది.తారక్ ఎప్పటికైనా మంచి పొలిటీషియన్ అవుతాడని, అందులో ఎలాంటి అనుమానం లేదని తెలిపింది. తారక్ కు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, తాత స్థాపించిన పార్టీకి నష్టం జరగకూడదనే పార్టీలోని లోటుపాట్లు, కుటుంబంలోని గొడవల గురించ మాట్లాడటం లేదని శ్రీరెడ్డి చెప్పింది.చంద్రబాబు మరణించిన తర్వాత ఎన్టీఆర్ పాలిిటిక్స్ లోకి రావడం ఖాయమని శ్రీరెడ్డి తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -