Balakrishna: ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన బాలకృష్ణ దంపతులు!

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అఖండ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ వరుసగా రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

గోపీచంద్ సినిమా అనంతరం బాలయ్య అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టాక్ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి క్యాన్సర్ చికిత్స చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.

ఇకపోతే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం బాలకృష్ణ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం ద్వారా ఉచిత అంబులెన్స్ సర్వీస్ అందించనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా 200కు పైగా వ్యాధినిద్దారణ, వైద్య సంప్రదింపులు, అవగాహన, మాతా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ రథం ద్వారా నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆరోగ్య రథం అంబులెన్స్ బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరతో కలిసి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణ ఇలాంటి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యి విజయవంతం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -